Friday, July 29, 2016

పరమాత్మ ఎక్కడున్నాడు ??





ఏంటో ఈ రోజు నా ఆలోచనలు ఆధ్యాత్మికత వైపు పరుగులు తీసాయి .. ఆధ్యాత్మికత తో పాటు మానవ సత్ప్రవర్తన, నైతిక విలువలను కూడా రాస్తే బాగుంటుంది అనిపించింది.. అందుకే ఇలా రెండిటిని మిశ్రమం గా మలిచి మీ ముందుకు...

ఆధ్యాత్మిక దృష్టితో మాత్రమే చదవండి..

మానవుడు ఏ పని మొదలు పెట్టాలన్నా మనస్సులో ఒక సంకల్పం అనేది వుండాలి.. శాస్త్రాలు ఏ విధంగా చెప్పాయో ఆ విధంగా నడుచుకోవడం ధర్మం .. ధర్మం ఆచరిస్తే శ్రేయస్సు కలుగుతుంది.. ఆ ధర్మం స్వరూపం తెలుసుకోవడానికి మనకు శక్తి, సామర్ధ్యాలు లేకపోతే మహాత్ముల సేవ చేసి ధర్మ స్వరూపాన్ని తెలుసుకోవచ్చు..

మనం అనుకుంటాం ఐశ్వర్యం, అధికారం వీటివల్ల సుఖం కలుగుతుంది అని.. కాని నిజానికి అది తాత్కాలికమే.. శాశ్వతం కాదు.. ఐశ్వర్యము కలవాని దగ్గరకు వెళ్లి సుఖమైన శాంతి అనుభావిస్తున్నావా ? అని ప్రశ్నిస్తే “లేదు” అనే స్పష్టంగా చెప్తాడు... ఈ మధ్యన నా మిత్రుడు ఒకడు మధ్యంతర శిరి కలిగి అనుభవిస్తున్నాడు.. అతను మొదట చాలా సంతోషంగా వున్నా తరువాత ఇంతకుముందే బాగుంది అనుకునే స్థాయికి వచ్చాడు.. ఇంత ఐశ్వర్యం ఉందిగా .. సుఖ శాంతులు లేకపోవడం ఏంటి ?? అని మళ్ళి ప్రశ్నిస్తే ఈ ఐశ్వర్యం వచ్చాకనే అవి కరువైనాయి అంటాడు...అలాగే అధికారం లభిస్తే సుఖంగా ఉండొచ్చు అనుకుంటాం.. అధికారం పెరిగేకొద్దీ అశాంతి పెరుగుతుంది.. సమస్యలు ఎక్కువ అవుతాయి.. మరీ శాశ్వతమైన సుఖశాంతి ఎక్కడ వుంది అంటే పరమాత్మ స్వరూపం తెలుసుకున్నప్పుడే మనకు శాశ్వతమైన సుఖ శాంతులు దొరుకుతాయి... అది లేనినాడు సుఖ శాంతులు ప్రాప్తించవు... వాస్తవస్వరూపం తెలుసుకోవలసి వుంది.. పరమాత్మ ఎక్కడున్నాడు ?? గుడిలో వున్నాడా ? మసీదులో వున్నాడా ? చర్చ లో వున్నాడా.. ? లేక పర్వతాలలో వున్నాడా ? కాదు.. పరమాత్మ సర్వ వ్యాపకుడు.. ఆయన లేని చోటు లేదు.. సమస్త జగత్తులో పరమాత్మ నిండి వున్నాడు..

ఒకసారి భావతం తీసి దాంట్లో “ప్రహ్లాదోపాఖ్యానం” చదివితే భగవంతుడు లేని చోటు కనిపించదు.. హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో “ఎక్కడున్నాడు నీ భగవంతుడు చూపు” అని అంటే భగవంతుడు ఎక్కడ లేడు ? అని తిరిగి సమాధానమిస్తాడు.. ఇలా

“ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి జూచిన నందందే గలడు దానవాగ్రణి వింటే!

బాల భక్తుడు ప్రహ్లాదునికి వున్న ఉత్కృష్ట సంస్కారం లేనందువల్లే మనం భగవద్దర్శనం చేయలేకపోతున్నాం... ఇది మనం గ్రహించాలి..

మనుష్య జన్మ పొంది కూడా మనం మనుష్యులుగా జీవించక పోతే ఇక పశుజన్మే గతి.. కూడని పనులు చెయ్యడం వల్ల నరకం, దుఃఖం ఇవి రెండూ మాత్రం తప్పవు.. భగవంతుడు అందరి హృదయాల్లో ఉన్నాడని, సమస్త పుణ్య పాపాలు చూస్తుంటాడని.. ఎప్పుడో ఒకప్పుడు ఆ పరమాత్మకు మనం సమాధానం చెప్పాల్సి వుందని జ్ఞాపకం వుంచుకోవాలి.. మన కర్తవ్యాన్ని మనం ఏమరుపాటు లేకుండా నిర్వహించుకోవాలి.. అప్పుడు మనవల్ల పొరపాట్లు అనేవి జరగవు..

అందరూ సనాతన ధర్మం అని అంటూ వుంటారు.. ఈ సనాతన ధర్మం అనేది నిన్న, ఇవాళ పుట్టినది కాదు.. సృష్టి మొదట్లోనే పరమాత్మ ప్రజలకు ధర్మం గురించి భోదించి వున్నాడు.. ఆది, అంతం లేనిదే సనాతన ధర్మం.. ఈ ధర్మాన్ని గురించి మీరు పాటిస్తూ శ్రేయస్సును పొందండి అని పరమాత్మ చెప్పివున్నాడని శాస్త్రాలు చెప్తున్నాయి.. ఆ ధర్మాన్ని కాపాడవలసిన భాద్యత మనమీదే వుంది..ఆ పరంపర ప్రకారమే మనం జీవనం గడపాల్సి వుంటుంది.. మన పూర్వీకుల చరిత్ర చదువుతుంటే వాళ్ళు ఎటువంటి కష్ట పరిస్థితులలోనూ ధర్మాన్ని వదిలిపెట్టలేదు.. ఆపదలు ఎప్పుడూ మనుష్యులకు వస్తూనే వుంటాయి. అయితే ఆ ఆపదలను తప్పించుకోవడం కోసం మన ధర్మాన్ని మాత్రం మనం వదలకూడదు.. పరిస్థితులను బట్టి ధర్మాన్ని వదులుతున్నామనేది వివేకులైన వారికి ఏ మాత్రం తగదు.

మనం సంకల్పించే పనులు పరిశుద్దమైన సంకల్పంతో కూడి వుండాలి.. అప్పుడు భగవంతుని సన్నిదిలో మనశ్శాంతిని పొందుతారు.. భగవంతుడు కూడా మనకు తోడ్పడుతాడు..

స్వస్తి.. ___/\___

Bobby Nani

No comments:

Post a Comment