Saturday, January 28, 2017

4జి వాడే వినియోగదారులు అందరూ ఒక్క క్షణం ఇది చదవవలసినదిగా మనవి..



“వినాశకాలే విపరీత బుద్ధి..” 
కన్నీరు కారుస్తూ కనుమరుగవుతున్న చిరు జీవులు.. 
****************************************

4జి వాడే వినియోగదారులు అందరూ ఒక్క క్షణం ఇది చదవవలసినదిగా మనవి.. 

వేగం .. వేగం ఇప్పుడు మనకు కావాల్సింది ఈ వేగమే .. పండు ముసలివారు దగ్గరనుంచి పడుచోడి దాకా ఈ వేగాన్ని అందుకోవాలని, ఆస్వాదిచాలని పరితపించే వాళ్ళే, ప్రయాత్నించేవాల్లె .. అందులో ముఖ్యమైనదే ఈ 4జి నెట్వర్క్.. వేగవంతమైన అంతర్జాలాన్ని అందిస్తున్న ఈ 4జి నెట్వర్క్ లో కొన్ని లోపాలు, నష్టాలు, ఉన్నాయని ఊహించకపోవడం చాలా బాధాకరం.. 

ఒక పుష్పం నుంచి మరో పుష్పం మీద వాలి, తమ కాళ్లకు అంటుకున్న పుప్పొడి రేణువుల ద్వారా పర పరాగ సంపర్కం అనే ఓ అమోఘమైన సృష్టికార్యం మొక్కలలో జరుగుతోంది అన్న విషయం అందరికీ విధితమే. కాని తెలియని విషయం ఏంటంటే.. 

ఇలా ఉత్ప్రేరకాలుగా ఉంటూ, ఆయా మొక్కల ప్రత్యుత్పత్తికి బాటలు పరుస్తూ, తద్వారా సమస్త ప్రకృతి మాతను పచ్చగా కళకళలాడేలా, శోభాయమానంగా చేసి, మనకు, జంతువులకు, పశుపక్ష్యాదులకు ఆహారాన్ని అందించేలా చేస్తున్న ప్రతి కీటకమూ ఒక విధంగా ప్రాణప్రదాతలే... 

కానీ, ఇప్పుడు ఆ చిరు కీటకాలే చిన్నబోయి ప్రాణాలు విడుస్తున్నాయి. రసాయనాల వాడకం, కాలుష్యం, ముఖ్యంగా 4జి నెట్వర్క్ ల లాంటి మరెన్నో కారణాలతో మానవుని విపత్కర వింత చర్యలకు కన్నీరు కారుస్తూ, కనుమరుగైపోతున్నాయి.... 

తేనెటీగలు, తుమ్మెదలు, తూనీగలు తదితర కీటకాలను 'పాలినేటర్స్‌' అని అంటాము.. పొలాల్లో ఉపయోగించే హానికార రసాయనాలు, వాయు కాలుష్యం, గ్లోబల్‌ వార్మింగ్‌, కరువు, కీటకాల నివాసాలను రూపుమాపడం తదితర కారణాల వల్ల పాలినేటర్స్‌ అనూహ్య స్థాయిలో మత్యువాత పడుతున్నాయని కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

గిరీష్ కుమార్ గారు గడచిన 24 సంవత్సరాలుగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం లో IIT బొంబాయి ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తూ Parth MN అనే ఇంటర్వ్యూలో మానవ ఆరోగ్యం, మరియు పర్యావరణం పై ప్రభావం చూపే కొన్ని ఆసక్తికరమైన నిజాలను తెలియజేసారు.. 

రానున్న 10 ఏళ్ళలో మన భారతదేశపు పంటలలో 31% పంటను నష్టపోతామని స్పష్టం చేసారు... ఇప్పటికే 80% పంట మన చేతికి వస్తుంది.. ఈ 4జి నెట్వర్క్ ఇలానే కనుక కొనసాగితే 49% పంట మాత్రమే చేతికి అందుతుంది.. మీకు తెలుసా ?? మనం తినే వంద రకాల ఆహార పదార్థాల్లో సుమారు డెబ్బైపదార్థాలు కేవలం తేనెటీగల వల్ల కలిగే మొక్కల పరాగసంపర్కం వల్లే ఉత్పత్తి అవుతున్నాయి అని.. ప్రాణాన్ని ప్రసాదించే చిరు జీవులను మన చేతులారా మనమే నాశనం చేస్తూ.. “వినాశకాలే విపరీత బుద్ధి..” అనే మాటను తూచాతప్పకుండా అక్షరాలా నిజం చేస్తున్నాం.. 

ప్రాణికోటికి 70 శాతం ఆహారాన్ని అందిస్తున్న ఈ పాలినేటర్స్‌ జీవన్మరణ సమస్య ... రసాయనాల వాడకం, మానవుని వికృత చేష్టలు, కాలుష్యం, ముఖ్యంగా 4జి నెట్వర్క్ ల వల్ల అనూహ్యంగా తగ్గుతున్న ఈ పాలినేటర్స్‌ సంఖ్య అమలు కాని ప్రభుత్వ నిబంధనలు, బరి తెగిస్తున్న అక్రమార్కులపై తగిన చర్యలు తీసుకోకపోతే ముందు ముందు భారీ నుంచి అతిభారీ మూల్యం చెల్లించక తప్పదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు... 

ఒక సంస్థ నిర్వహించిన ప్రయోగంలో కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలిసాయి.. 
మన ఇంట్లో వైఫై నుంచి వచ్చే తరంగాల వల్ల “పాచి” ని 96 గంటల్లో నాశనం చెయ్యొచ్చు ... 

3జి నుంచి వచ్చే తరంగాలనుంచి అదే “పాచి” ని 72 గంటల్లో నాశనం చేయ్యోచ్చు.. 
4జి నుంచి వచ్చే తరంగాలనుంచి అదే “పాచి” ని కేవలం 42 గంటల్లో నాశనం చేయ్యోచ్చు.. అని ఓ ప్రముఖ సంస్థ అధ్యయనం చేసి నిరూపించింది.. అంతే కాదు మానవ డి.ఎన్.ఏ. లో కూడా కొన్ని మార్పులు వస్తున్నట్లు తెల్పింది.. దీనిపై మరింత అధ్యయనం అవసరమని త్వరలో ఒక ప్రకటన విడుదల చేస్తామని స్పష్టం చేసింది.. 

ఒక తేనెటీగ తన మనుగడను ఎలా నిలుపుకోగలుగుతుందో తెలుసా...?? 

తేనెటీగ ఏ జీవినైనా కుడితే దాని కొండె ఆ జీవి దేహంలో చిక్కుకుపోతుంది. దానిని వదిలించుకునే ప్రయాసలో ఆ జీవి చనిపోతుంది. ఇది తెలిసిన విషయమే..... కాని ఇది కాకుండా తేనెటీగలు మరో పద్దతిని కూడా అవలంభిస్తున్నాయి... ఉష్ణశక్తిని ఉత్పన్నం చేసే ఈ ప్రక్రియను 'థెర్మో బాలింగ్‌' అంటారు. తేనెటీగలు 50 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత వద్ద కూడా సురక్షితంగా ఉండగలవు..... అదే వాటి శత్రువులైన కందిరీగలాంటి కీటకాలు అంతటి వేడిమిని తట్టుకోలేవు..... అందువల్ల శత్రువులు వచ్చినప్పుడు తేనెటీగలు అత్యంత వేగంగా తమ రెక్కలను, కండరాలను కంపింపచేయడం మొదలెడతాయి.... తద్వారా వాటి చుట్టూ పరిసరాల్లో ఉష్ణోగ్రత దాదాపు 47 డిగ్రీల సెంటిగ్రేడు వరకు పెరిగిపోతుంది. ఆ వేడిని తట్టుకోలేని కీటకాలు మరణిస్తాయి.... ఈ విద్యతో తేనెటీగలు తమ పట్టుపై ఫంగస్‌ లాంటి సూక్ష్మజీవులు పెరగకుండా కూడా చేస్తాయి..... వాటి మనుగడకోసం అవి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ... మనిషి మాత్రం వాటిల్ని సింపుల్ గా చంపేస్తున్నాడు.. నిజానికి మనం చంపేది తేనెటీగలను కాదు.. మన ముందు ముందు తరాల సంతతిని .. 

స్వస్తి.. ___/\___
Written by : Bobby Nani

No comments:

Post a Comment