Saturday, July 16, 2016

నాటి కాలంలో చాణక్యుడు సూచించిన శిక్షలు ఇప్పుడు, ఇక్కడ, వెను వెంటనే అమలుచేయాలి....

బాలికలపై, మహిళలపై అత్యాచారాలు నిత్యకృత్యాలవుతున్న ఈ రోజులలో ఇక ఈ మేడిపండు ప్రజాస్వామ్య చట్టాలు పక్కనబెట్టి ..... ఈ దేశానికి సరిపడేలా రూపొందింపబడ్డ ఆనాటి చట్టాల అమలు మరలా అవసరం..... 


ఈ దేశంలో ఒకప్రణాళిక ప్రకారం ధ్వంసం చేయబడ్డ విద్యావిధానాల వలన జాతి సంస్రుతీ సంపదలను కోల్పోతున్నది....... నవసంబంధాలలో మానవీయవిలువలను కోల్పోయి మార్కెట్ విలువలు ప్రతిష్టింపబడుతున్నాయి. కావలసినది పొందటం, ఎటువంటి దానికోసం అయినా ....  ఎంతటి నీచానికైనా దిగజారటం. భౌతిక సుఖాలను పొందటమే పరమలక్ష్యం గా సాగుతున్న ఈ చదువుల ఫలితాలు నేడు అర్ధనగ్నవస్త్రధారణలను ఆధునిక అలంకారాలుగాను, రకుక్కల్లాఎవరితోబడితేవారితో తిరిగే పాశ్చాత్య సంస్కృతిని స్వేఛ్ఛాజీవనానికి సంకేతంగానూ మార్చేశాయి.... విలువల వలువలు విడిచేశాక ఇక ఆడాలేదు, మగాలేదు మృగాల మనఃస్థితే !

మనకు నచ్చినంతసేపూ .... ప్రమాదం మనదగ్గరకు రానంతసేపూ.....  వీటికి ఆహో! ఓహో! అనే బాకారాయుళ్ళు అసలు ప్రమాదాలను గ్రహించరు.... గుర్తించరు ... పరిస్థితి చేయిదాటింది . ఇప్పుడు నీతివాక్యాలు , సత్య ధర్మ పాలన పనిచేయవు, పనికిరావు ... 

భయం ...భయం.. భయం కావాలి నేటి  మా జాతికి.... 

తప్పుచేస్తే ఏం జరుగుతుందో తలచుకుంటేనే వణుకుపుట్టేంత భయం కావాలి. ... 

నిర్ధాక్షిణ్యంగా తప్పుడుపనులకు తెగబడెవారి తలలు నేలకు రాల్చాలి.... 

అందుకే అర్ధశాస్త్రాన్ని రచించిన చాణక్యుడు కఠినమైన శిక్షలు సూచించాడు... అందుకే  ఆయనంటే నాకు అమిత  భక్తి ప్రపత్తులు... 

మానభంగం చేసినవాడికి మర్మాంగాలను కోసివేయడం....
దొంగతనం చేసినవాడికి వేళ్ళుతెగనరకడం....
ప్రజలను దోచుకున్నవాడికి బహిరంగంగా శిరచ్చేదన చేయడం ....
ఇలాఉండాలి శిక్షలు అంటే.. ఒకప్పటి  మన  శిక్షలు ఇవే... కాని మనమే  వాటిని మరిచిపోయాం... పక్క  దేశాలవారు  ఇలానే చేస్తున్నారు.....  అందుకే అన్యాయాలపై వారి శాతం స్వల్పం ..... మన శాతం  అమితం ... 

ఆధునుకతపేరుతో పిల్లలకు అసభ్యకరమైన వస్త్రధారణలకు అనుమతినిస్తూ, పబ్బు గబ్బులకు అలవాటవుతున్నా కళ్లప్పగిమ్చి చూస్తున్న తల్లిదండ్రులను, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ లంటూ విచ్చలవిడితనాని అలవాటుపడుతున్న పిల్లలకూ శిక్షలుండాల్సిందే....

ఎన్నిమాటలు చెప్పినా పరాయివారైన స్త్రీపురుషుల మధ్య ఉండే సంబంధాలలో అంతర్లీనంగా ఉండేది "కామవాంఛే' నని ఈమధ్య శాస్త్రవేత్తలు నిగ్గుతేల్చి చెప్పారు కదా ! కనీసం ఈవిషయాలనైనా నమ్మాలి. ఈ వావివరుసలు. శీల సంపద పట్ల శ్రద్దలేని వారికి తగిన శిక్షలుండాల్సిందే ....

ఇంతకఠినమా ??? 
మానవత్వం వద్దా ... ! అని సోది మాట్ళాడకండి.....  

మానవత్వం  గురించి  మనం  మాట్లాడే  అర్హతను  ఎప్పుడో  కోల్పోయాం.. 

పురిటిబిడ్డలు చెత్త బుట్టలలో వున్నప్పుడేమైంది ఈ  మానవత్వం ?? 

నెలల  బాలికమీద అత్యాచారం జరిగినప్పుడేమయింది ఈ  మానవత్వం ?? 

మొన్న ఒక  నిర్భయ, నిన్న ఒక   రిశితేశ్వరి ఇలా ఎందరో రోజుకో ఆడతనం నలిగిపోతుంది.. ఇంకెక్కడ మానవత్వం ?? 

మానవత్వం చూపాల్సింది మనుషులపట్ల. మనిషన్నవాడు చనిపోయి మృగాకారాలుగామారి తిరుగుతున్నవారి పట్లకాదు.....

ఎంతత్వరగా ఈ చట్టాలు రావాలంటే . మరో చెల్లి, తల్లి బ్రతుకులు అన్యాయం కాకుండా ముందుగానే కావాలి, రావాలి ...మన రాజ్యాంగంలో ప్రస్తుత  పరిస్థితుల  రీత్యా  చాలా సవరణలే చేసారు ...  కాని అవి చాలవు, ఇంకా ఖటినతరం చెయ్యాలి తప్పు చెయ్యాలనే  ఆలోచన వస్తేనే తడిచిపోవాలి... ఇలాంటివి  రావాలని  మనస్పూర్తిగా  కోరుకుంటూ  నా  ఆవేదనను మీతో  పంచుకుంటూ  వున్నాను..  ఉదయం  పేపెర్  చూసింది మొదలు రాత్రి వార్తలు విన్న  వరకు ఏదో ఒక మూల ఎక్కడో ఒకదగ్గర పలానా వాడు ఇలా చేసాడు అనే రాతలు చూసి తట్టుకోలేకున్నాం ..... అంతకు మించి మరో ఉద్దేశం లేదు.. 

చివరగా నా  మాట : ప్రస్తుతం జంబూ ద్వీపానికి కావలసింది ఒక కౌటిల్యుడు. అవును కౌటిల్యుడే. అప్రాచ్యులు దండెత్తి వచ్చినప్పుడు, రాజుల నుంచి సామాన్యుల వరకు వర్గ విభేదాలు మరచిపోయేలా చేసి, జంబూ ద్వీపాన్ని ఒక తాటి మీదకు తెచ్చిన కౌటిల్యుడు. అన్యాయాన్ని సహిస్తూ బతకడం కన్నా ఎదిరిస్తూ మరణించడం గొప్పదన్న కౌటిల్యుడు. కుటుంబం కోసం సభ్యుడిని, గ్రామం కోసం కుటుంబాన్ని, దేశాని కోసం గ్రామాన్ని ఫణం పెడితే తప్పు లేదని నిర్మొహమాటంగా చెప్పిన కౌటిల్యుడు (చాణక్యుడు ) అందుకే ఆయన అంటే నాకు చాలా గౌరవం... ఎవరి అభిప్రాయాలు వారివి... మనుషులను గౌరవించని నేటి రోజులలో కనీసం అభిప్రాయాలను అయినా గౌరవించమని చిన్న విన్నపం ... 

స్వస్తి  __/\__

Bobby Nani

No comments:

Post a Comment