Tuesday, July 26, 2016

ఇది ఆవేశపూరిత అక్షరాలు కాదు.. ప్రతీ భారతీయుడి గుండె చప్పుడు..


రోజు రోజుకీ జనాలు కులం, మతం పిచ్చితో పెట్రేగిపోతున్నారు ...
"మొక్కై వంగనిది మానై వంగునా"
అనే నానుడి లోని మాటలు నిజం అవుతున్నాయి ... ఈ పిచ్చి రోజు రోజుకు మనవాళ్ళలో స్తిరత్వం లేకుండా పెరిగిపోతూ ఉచ్ఛస్థితికి చేరుకుంటుంది ... దీన్ని ఎవరూ ఆపలేరు అని అనుకుంటున్నాను.... ఒకవేళ ఆపాలంటే ఒక అద్బుతం జరగాలి ... మనకు స్వాతంత్ర్యo వచ్చినప్పుడే దీన్ని కట్టడి చేసుంటే ఈ రోజువరకు ఎందరో అభాగ్యులు బలికాకుండా వుండేవారు ... 

ఎన్నో కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండేవి.. ... 
చాలా చాలా బాదగా వుంది ...

మన దేశంలో నిజాయితీగా పనిచేసే వారు 20% మాత్రమే కాని విచిత్రం ఏంటంటే రోజు రోజుకీ వీరి సంఖ్య తగ్గిపోతుంది. కారణం మిగిలిన 80% మంది వీళ్ళని ఏదోఒక రకంగా లొంగదీసుకుంటున్నారు ... సరే మనం ఎవరన్న నిజాయితీగా వున్నామా అంటే ఎలక్షన్స్ వస్తే మనవాళ్ళు 80% డబ్బులు తీసుకునే ఓటు వేస్తున్నారు ... మీరు మిమ్మల్ని అమ్ముకుంటూ ఉన్నంత కాలం పరిస్థితి ఇలానే వుంటుంది .... ఒక దేశం బాగుండాలి అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ బాగుండాలి ... అది బాగుండాలంటే దాన్ని నడిపే నాయకుడు సరైన వాడు అయివుండాలి ... సరైన నాయకుడను ఎన్నుకోవాలంటే ముందు మనం నిజాయితీగా వుండాలి ... ప్రతీ ఒక్కరు వారికి వారు ఇలా స్వతహాగా అనుకున్నప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది ...

"ప్రజలను రక్షించుటకు, దుర్మార్గులను నశింపజేయటకు ధర్మాన్ని పున:స్థాపించుటకు ప్రతి యుగమున నేను జన్మిస్థాను" అని శ్రీకృష్ణుడు చెప్పాడు.
“మన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏటా షుమారు నలభై ఐదు లక్షల కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నాయి. అంటే సగటున ఒక కుటుంబానికి లక్ష్యా యాభై వేల రూపాయలన్న మాట.

ఆయినా ఇంకా ఇళ్ళు లేని పల్లెలున్నాయి... .

కరెంటు లేని విలేజ్ లు ఉన్నాయి..

రోడ్లు లేని గ్రామాలున్నాయి....

మంచినీళ్ళు లేని ఊళ్ళున్నాయి....

సాధారణ జ్వరానికే నేల రాలే వారు వేలల్లో....

ఉద్యోగాల్లేక, పెళ్ళిళ్ళు కాలేక పరువు కోసం నరకయాతన అనుభవించే యువత లక్షలు....

రెండు పూటల కడుపు నిండా తిండి లేని వారు అరవై కోట్ల పై మాటే. ....

ప్రపంచంలోని నిరక్షరాసుల్లో సగం మంది భారతీయులే...

మరి ఏమవుతుంది ఈ ప్రజాధనం? ....”

“నల్ల ధనాన్ని వెలికి తీస్తే ఇప్పటివరకు మన దేశం చేసిన అప్పులన్నీ తీర్చవచ్చని అంచనా. ఇంకా మిగిలిన ఆ ధనాన్ని భారతీయులందరికీ పంచి తే తలా లక్షరూపాయలు పైగానే వస్తుందట....” ఇది మనం గొప్పగా చెప్పుకునే, చెప్పుకుంటూనే వుండే మన స్వతంత్ర భారతం ....

రైతుకు ఆకలేస్తే పచ్చని పైరుసాయి చూసే రోజులు పోయి.. ఆకలేస్తే ఆకాశానికి చూసే రోజులు వచ్చాయని అతను కన్నీటిపర్యంతం అవుతుంటే హృదయం ద్రవీకరిస్తుంది..

ఇది ఆవేశపూరిత అక్షరాలు కాదు.. ప్రతీ భారతీయుడి గుండె చప్పుడు..


స్వస్తి __/\__
Bobby Nani​

2 comments: