Saturday, January 27, 2018

ఓ మిత్రుడు ఆడిన ప్రశ్న ..



ఓ మిత్రుడు ఆడిన ప్రశ్న .. 
శ్రీకృష్ణుడు ఒక్క అర్జునునికే ఎందుకు భగవద్గీతను బోధించాడు మిగతావాల్లెవ్వరూ అందుకు అర్హులు కాదా అని.. 
దానికి నా చిరు సమాధానం.. 
చాలా రోజులతరువాత నిక్కార్సైన ధర్మ సందేహం.. 
ప్రశ్న అడిగిన మిత్రునికి కృతజ్ఞతలు తెల్పుకుంటూ.. 

శ్రీకృష్ణుడు కాని, భాష్యకారులు కానీ, ఆ తరువాత వచ్చినవారు కాని కాదు.. అర్జునుడు మధ్యమాధికారి అయినట్లయితే శ్రీకృష్ణుడు ఆయనకు యోగశాస్త్రం బ్రహ్మవిద్య అయిన గుహ్యశాస్త్రాన్ని చెప్పేవాడేకాదు... పాండవ రాయబారిగా వెళ్ళి హస్తినాపురంలో భీష్మ, దృతరాష్ట్రులున్న కొలువులో విశ్వరూపాన్ని ప్రదర్శించాడే కాని అక్కడ బ్రహ్మ విధ్యను బోధించలేదు .. ఆ సభలో విదురుడు, సంజయుడు, ధౌమ్యుడు ఇత్యాది మహానుభావులు ఉన్నప్పటికీ అర్జునుని అర్హతను గుర్తించినందువల్ల, అతని గుణగణాదులను తెలుసుకున్నందువల్ల బ్రహ్మవిద్యా స్వీకారానికి కావలసిన అర్హతతో కూడిన సద్గుణ సంపత్తి కలవాడు అని శ్రీకృష్ణుడు గుర్తించినందువల్ల అన్జునిలో విషాదాన్ని పోగొట్టటానికై చెప్పిన గీత భగవద్గీత.

తత్వోపదేశానికి బీజభూతమైన అద్వైతం అనే అమృతపు జల్లును పదునెనిమిది కలశములనే అధ్యాయాల ద్వారా చల్లడం జరిగింది.. భగవద్గీతలో పదునెనిమిది అధ్యాయాలు ఉన్నాయి.. 

1. అర్జున విషాదయోగం 
2. సాంఖ్యా యోగం 
3. కర్మ యోగం 
4. జ్ఞాన యోగం 
5. కర్మ సంన్యాస యోగం 
6. ఆత్మ సంయమన యోగం 
7. విజ్ఞాన యోగం 
8. అక్షర పరబ్రహ్మ యోగం 
9. రాజవిద్యా రాజగుహ్య యోగం 
10. విభూతి యోగం 
11. విశ్వరూప సందర్శన యోగం 
12. భక్తి యోగం 
13. క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగం 
14. గుణత్రయ విభాగయోగం 
15. పురుషోత్తమ ప్రాప్తి యోగం 
16. దైవాసుర సంపద్విభాగ యోగం 
17. శ్రద్ధాత్రయ విభాగ యోగం 
18. మోక్ష సంన్యాస యోగం 

భగవద్గీతలో ప్రతీ అధ్యాయం ఆఖరున ఈ విధంగా ఉంటుంది 

“ఇతి శ్రీ భగవద్గీతా సూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం 
యోగశాస్త్రే. శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ
యోగేనామ త్రయోదశ అధ్యాయం” !!

దీన్ని ఉదాహరణకు మాత్రమే ఇవ్వడం జరిగింది.. శ్రీ కృష్ణార్జునుల సంవాదం ఇది.. ఉపనిషత్తులతో సమానమైనది. యోగశాస్త్రం అంటే అప్రాప్త మైనదాన్ని ఇస్తుంది.. ఈ విధంగా ప్రతీ అధ్యాయానికి అన్వయం చేసుకోవాలి .. 

ఒక్కముక్కలో చెప్పాలంటే భగవద్గీత ‘డైనమిక్‌ ప్రిస్కిప్షన్‌ ఫర్‌ లైఫ్‌’.

భగవద్గీత హిందువులది, కనుక నేను దాన్ని చదవను, నాకు దాని అవసరం లేదు... అని చెప్పేవాళ్లు ఎలాంటివాళ్లంటే ?? 

“భూమ్యాకర్షణ సిద్ధాంతం న్యూటన్‌ కనిపెట్టాడు, అది బ్రిటిష్‌వాళ్లది – మనం దాని జోలికి పోవద్దు”

అనేవాళ్లతో సమానం. గీత ఒక్క హిందువులది మాత్రమే కాదు భారతీయులు అందరిదీ.

ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి అంటే దానర్థం అన్నిటినీ వదిలేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం కానేకాదు. ప్రపంచం అందిస్తున్న అన్నిటినీ ఇంద్రియాల సాయంతో, తెలివిగా వాడుకోమని. అలా వాడుకుంటే ప్రశాంతత, తద్వారా విజయం లభిస్తాయి. ఇలాంటి కోట్ల ప్రశ్నలకు నీకు గీతలో సమాధానం దొరుకుతుంది.. 

గీత అంటే కేవలం పుస్తకం కాదు నువ్వేంటో నువ్వు తెలుసుకునే ఓ మర్మ శాస్త్రం.. 

Written by : Bobby Nani

No comments:

Post a Comment