Thursday, December 28, 2017

1977 వ సంవత్సరములొ జరిగిన ఓ ఆశ్చర్యకరమైన, అద్భుతమైన సంఘటన ఇది..


నిన్న రాత్రి పడుకునే ముందు ఓ డాక్యుమెంటరీ చదివాను..చదివిన దగ్గరనుంచి అవే ఆలోచనలు ఇప్పటికీ నను వెంటాడుతూనే ఉన్నాయి .. ఇలా రాయడానికి కూడా కారణభూతాలైనాయి.. 

1977 వ సంవత్సరములొ జరిగిన ఓ ఆశ్చర్యకరమైన, అద్భుతమైన సంఘటన ఇది.. 

రోమ్ నగరంలో స్థిర పడిన మన భారతీయుల జంటకు రెండు సంవత్సరముల పాప వుండేది.. తన పేరు “నడోజామిట్టీ” ఈ పాప కొన్ని అనివార్య కారణముల వల్ల అకస్మాత్తుగా 1965 వ సంవత్సరములో మరణించింది.. వారికి లేక లేక పుట్టిన సంతానం .. తనని ఎంతో గారాబంగా చూసుకుంటూ వుండేవారు.. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించి ఉండలేదు.. ఆ పాప మరణం ఆ తల్లితండ్రులను దుఃఖసాగరంలో ముంచేసింది.. 

వారి ఆచారము ప్రకారం ఆ పాప దేహాన్ని శ్మశానంలో పాతిపెట్టారు.. 
ఆనాటి నుండి ప్రతీ రోజూ “అమ్మా నన్ను బయటికి తియ్యి.. నేను నీతోనే ఉంటాను ... నన్ను తవ్వి తియ్యి ..” అంటూ ఆపాప రాత్రుల్లో తల్లికి కనిపించి మొరపెట్టుకునేదంట..!!

ముందు ఆ తల్లి కొంత కాలము ఈ విషయంలో పెద్దగా పట్టించుకోలేదట .. కానీ రోజూ వదిలిపెట్టకుండా ఆ పాప అలా కల్లో కనబడి మొర పెట్టుకుంటుంటే ఇక సహించలేక పోయింది.. నిజంగా పాప బ్రతికే ఉందా ?? అనే భ్రమలో పడింది.. ఆ తల్లి మానసికంగా ఏదో తెలియని ప్రభావానికి లోనైపోతూ ... అక్కడి ప్రభుత్వానికి తన మొర విన్నవించుకుంది.. 

ప్రభుత్వమూ, అధికారులూ వేళాకోళము చేసారు.. ఆమెను మతిస్థిమితం లేనిదానిగా భావించారు.. అయినా ఆ తల్లి పట్టు వదల్లేదు.. ప్రభుత్వంతోనూ, అధికారులతోనూ పోరాడుతూనే వచ్చింది... అలా అలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా పన్నెండు ఏళ్ళు గడిచిన తరువాత ఎట్టకేలకు ప్రభుత్వం ఆ పాపను బయటికి తీసేందుకు ఒప్పుకుంది.. 

1965లో చనిపోయిన పాపను 1977 లో అక్కడి ప్రభుత్వ పనివారు ఆ పాపను పాతిపెట్టిన చోట తవ్వి చిన్నారిని బయటకు తీసారు... ఆ పాప దేహాన్ని చుసిన అక్కడివారు నిశ్చేష్టులైపోయారు.. అందుకు గల కారణం ఆ పాప ప్రశాంతంగా నిద్రపోతున్నట్లుండటమే .. 

ఇన్ని సంవత్సరములు ఆ పాప దేహం భూమిలో ఉన్నా కుళ్ళలేదు, రంగు మారలేదు.. చక్కని రబ్బరు బొమ్మలా ఉంది.. 

ఆ పాపను చూసిన ఆ తల్లి ఆనందంతో తన గుండెలకు హత్తుకుంది.. ఈ విషయం యావత్తు ప్రపంచాన్ని దిగ్ర్భాంతికి గురిచేసింది.. ఎవ్వరికీ అంతుపట్టని అద్బుత విషయమైపోయింది.. 

Written by : Bobby Nani

1 comment: