Saturday, June 23, 2018

దేశమే గొప్పది మనుషులు కాదు.. !!


దేశమే గొప్పది మనుషులు కాదు.. !!
***************************

ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగిన కారణంగా దాదాపుగా 50,000 కంటే ఎక్కువ సంఖ్య గల భారీ ట్రక్కులను సిటీ ప్రక్కన నుంచి కాకుండా వేరే దారి మళ్ళించే ఏర్పాటుతోటి మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఓ బృహత్కార్యానికి ప్రణాలిక వేశారు అదే “Eastern Peripheral Expressway” 



షుమారు 11,000 కోట్లు ఖర్చు చేసి ప్రపంచ అగ్ర దేశాలతో ఏమాత్రం తీసిపోకుండా, మన దేశంలోనే మొట్టమొదటి సారిగా ఎక్కడా లేనటువంటి అత్యాధునికమైన సౌకర్యాలతో 135 కిలోమీటర్ల మేర ఆరు లైన్ల “ఎక్స్ ప్రెస్ హైవే” నిర్మించేందుకు నవంబర్ నెల 2015 వ సంవత్సరములో ఈ తీర్మానం ప్రవేశ పెట్టారు.

తదుపరి ఫిబ్రవరి నెల 2016 వ సంవత్సరములో ఈ కార్యం ఆచరణ యోగ్యంగా మారి నిధులు సమకూరి పనులు జరగడం ప్రారంభమయ్యాయి.. తరువాత ఏప్రియల్ నెల 2017వ సంవత్సరములో దాదాపుగా అరవై శాతం పని పూర్తి కాబడి కాలుష్యం తో సతమతమౌతూన్న ఢిల్లీ ప్రజలకు ఊరట కలిగించే దిశగా మారింది... తదుపరి 2018వ సంవత్సరం ఏప్రిల్ 29 న ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించడానికి ఏర్పాటు చేసారు. కాని కర్నాటకలో ఎన్నికల కారణంగా తాత్కాలికంగా ఆరోజు రద్దు కాబడినది.

మే నెల 2018వ సంవత్సరం 31 వ తేదీ లోపల ప్రారంభించాలని భారత జాతీయ రహదారుల అధికార సంస్థ (NHAI) కు మన భారతదేశ సుప్రీంకోర్టు ఆదేశించింది. చిట్ట చివరగా ఇన్నేళ్ళ ఢిల్లీ వాసుల కల 27 మే 2018న మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చేతులమీదగా “Eastern Peripheral Expressway” ను ఎట్టకేలకు ప్రారంభించడం జరిగింది.. ఈ రహదారి కుంద్లి , సోనిపట్ నుండి, హర్యాణాలోని ఉత్తర ప్రదేశ్ మరియు ఫరీదాబాద్ జిల్లాలో, బాగ్పత్ , ఘజియాబాద్ మరియు నోయిడా జిల్లాల గుండా వెళుతుంది. 

దేశం గర్వించదగ్గ విషయం ఇది.. 

ఈ రహదారిలో ప్రతీ దగ్గర సెన్సార్స్, ఎల్.ఇ.డీ స్, లేసర్స్, పౌంటైన్ ఇలా ఎన్నో అత్యాధునికమైన పరికరాలను అమర్చి రూపొందించారు.. కేవలం ప్రారంభించిన 20 రోజుల్లోనే మన భారతదేశ పౌరులు అక్కడ ఏర్పాటు చేసినటువంటి సోలార్ ప్యానెల్స్, లైట్స్, బ్యాటరీస్, ఆఖరికి పౌంటైన్లలో అమర్చిన టాప్ లను కూడా వదలకుండా పట్టుకెళ్ళి అమ్మేసుకున్నారు.. వీటి విలువ షుమారు వందల కోట్లు.. 

ప్రపంచ దేశాలు దిగ్బ్రాంతి చెంది గాండ్రించి ఉమ్ముతున్నాయి .. 

ఎందుకు మనదేశం అభివృద్ధి చెందకుండా ఇంకా చెందుతూనే ఉందో ఓ చెంపపెట్టు లాంటి ఉదాహరణ ఇది.. 

ప్రతీ భారతీయుడు సిగ్గుతో తలదించుకునే సంఘటన... 

మారాల్సింది దేశం కాదు.. మనం...!! 

స్వస్తి __/\__

Written by : Bobby Nani

1 comment: